ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ముగించేలా భారత్ చొరవ తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్-రష్యా బంధం సుదీర్ఘమైనదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని సూచించింది.