పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్టు తాజాగా ప్రకటించారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్కు సేవలు అందించారు. పాక్ తరపున 136 వన్డేల్లో 3,369 పరుగులు, 44 వికెట్లు, 146 టీ20ల్లో 2,893 పరుగులు, 36 వికెట్లు పడగొట్టారు.