రాష్ట్రం ఆగమైంది.. కన్నీళ్లు వస్తున్నాయి: కేసీఆర్ (వీడియో)

210088చూసినవారు
రాష్టంలో పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌ కదనభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. 'పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. మొన్న నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గిపెట్టేవాణ్ణి.' అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్