నదిలో ఆవులను వదిలేసిన దుండగులు.. దాదాపు 20 ఆవులు మృతి (వీడియో)

73చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కొంతమంది దుండగులు ఆవులను ఉబ్బిన నదిలోకి వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనలో దాదాపు 15-20 ఆవులు మృతి చెందినట్లు సాత్నా పోలీసులు బుధవారం తెలిపారు. వీడియో వైరల్ కావడంతో దాని ఆధారంగా నలుగురు నిందితులు బేటా బగ్రీ, రవి బగ్రీ, రాంపాల్ చౌదరి, రాజ్లు చౌదరిలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you