3 రోజుల పసికందును మూట కట్టి కాల్వలో విసిరేసిన దుండగులు.. కాపాడిన పోలీసులు

73చూసినవారు
3 రోజుల పసికందును మూట కట్టి కాల్వలో విసిరేసిన దుండగులు.. కాపాడిన పోలీసులు
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. 3 రోజుల మగ శిశువును మూట కట్టి కాకతీయ కాల్వలోకి విసిరేశారు దుండగులు. జిల్లాలోని తుమ్మనపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ట్రాక్టర్ కడిగేందుకు కాల్వ వద్దకు వెళ్లిన బక్కారెడ్డి అనే రైతు సంచిలో ఉన్న శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు ప్రాణాలతో ఉండటం గమనించి ఆసుపత్రికి తరలించారు. విసిరేయడం వల్ల బాలుడికి గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్