గుజరాత్తో మ్యాచ్లో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు సామ్ కరన్ (20), ప్రభ్సిమ్రన్ (35) జట్టుకు శుభారంభాన్ని అందించినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయింది. GT బౌలర్లలో సాయి కిశోర్ 4 వికెట్లతో పంజాబ్ నడ్డివిరిచాడు. మోహిత శర్మ 2, నూర్ అహ్మద్ 2, రషీద్ ఒక వికెట్ తీసుకున్నారు. హర్ప్రీత్ బ్రార్ 29 పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.