లోక్సభ ఎన్నికలకు సంబంధించి 44 మంది అభ్యర్థులతో సీపీఎం తొలి జాబితాను విడుదల చేసింది. చాలా రాష్ట్రాల్లో ఒకటి లేదా రెండు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం.. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లకు అభ్యర్థులను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలోని అరకు స్థానానికి పాచిపెంట అప్పలనరస పేరును, తెలంగాణలోని భువనగిరి స్థానానికి ఎండీ జహంగీర్ పేరును ఖరారు చేసింది.