లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దావణగెరె బీజేపీ ఎంపీ అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వంట చేయడం మాత్రమే తెలుసని, ఇక్కడి సమస్యలపై ఆమెకు అవగాహన లేదని విమర్శించారు. దీనికి ఆమె 'మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని ఆ పెద్దాయనకు తెలియదా' అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా ఆ స్థానంలో ఎమ్మెల్యే కోడలు ప్రభా మల్లికార్జున్ పోటీ చేస్తున్నారు.