తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది పాస్ అయ్యారు. ఈ ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.05 శాతంతో ప్రథమ స్థానంలో, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. సిద్దిపేట 98.65 శాతంతో 2వ స్థానం, రాజన్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూళ్లలో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది.