పెరుగు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరానికి పెరుగు చల్లదనాన్ని కలిగిస్తుంది. పెరుగును కొన్ని పదార్ధాలతో కలిపి తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగు తిన్నాక టీ తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అరటిపండ్లు, మామిడి, ఉల్లి మొదలైన వాటిని పెరుగుతో పాటు తినకూడదని సూచిస్తున్నారు. ఇలా తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయని, పెరుగు పాలతో తయారు చేసినప్పటికీ రెండింటినీ కలిపి తినకూడదని వైద్యులు చెబుతున్నారు.