ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం

71చూసినవారు
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం
సార్వ‌త్రిక ఎన్నిక‌ల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను (ఎల‌క్ష‌న్ అబ్జ‌ర్వ‌ర్స్) కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. సాధారణ ఎన్నికల పరిశీలకుడిగా రాంమోహన్‌ మిశ్రా నియ‌మితుల‌య్యారు. ఇక పోలీసు వ్యవహారాల పరిశీలకుడిగా దీపక్‌ మిశ్రాను, ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నీనా నిగమ్‌ను ఈసీ నియ‌మించింది. వచ్చే వారంలోనే వీరు ముగ్గురూ రాష్ట్రానికి రానున్నారు.

సంబంధిత పోస్ట్