కొత్తగూడెం సింగరేణి గేటెడ్ కాలనీలో దొంగలు స్వైర విహారం చేశారు. కొత్తగూడెం పట్టణం ఏ పవర్ హౌస్ బస్తీలోని సింగరేణి ఉద్యోగుల ఎండీ టైప్ గేటెడ్ కాలనీలోని 3 క్వార్టర్ లలో దొంగలు చీరీకి పాల్పడ్డారు. ఎన్నికల విధుల కోసం, ఓట్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదు, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను అపహరించారు.