గతేడాది దేశంలో కొత్తగా 94 మంది డాలర్ బిలియనీర్లు అవతరించారని హురున్ తాజా జాబితాలో తేలింది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో మరే దేశంలోనూ పెరగకపోవడం గమనార్హం. దీంతో భారత్లో మొత్తం డాలర్ బిలియనీర్ల సంఖ్య 271కి చేరింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ 231 బిలియన్ డాలర్లతో ఉన్నారు. భారత్ నుంచి టాప్-10లో ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో స్థిరపడ్డారు.