పిస్టల్‌తో బెదిరింపు.. భయంతో వ్యక్తి ఆత్మహత్య

1080చూసినవారు
హైదరాబాద్ లోని రామంతాపూర్ సత్యనగర్ కాలనీలో హోంగార్డ్ నాగరాజు హల్చల్ చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిస్టల్‌తో ఇంటిపక్కనే నివాసం ఉండే శ్రీనివాస్(55)ని బెదిరించడంతో అతడు భయపడి పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు హోంగార్డ్ ఇంటి వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్