ఈతకు వెళ్లి ముగ్గురు మృతి.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత

56చూసినవారు
ఈతకు వెళ్లి ముగ్గురు మృతి.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత
నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం ఒడ్డ్యాట్‌పల్లి చెరువులో ఈతకు వెళ్ళి ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు గ్రామానికి చెందిన తిరుపతి(19), మహేశ్‌(19), నరేశ్‌(18), సాయితేజ, వినోద్‌లు శనివారం గ్రామ చెరువులో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో తిరుపతి, మహేశ్‌, నరేశ్‌లు చెరువులో మునిగి చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులు ముగ్గురూ వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో వారికి తీరని కడుపుకోత మిగిల్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్