జవాన్లతో వెళ్తున్న బస్సు ఢీకొని ముగ్గురు మృతి

60చూసినవారు
జవాన్లతో వెళ్తున్న బస్సు ఢీకొని ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్లతో వెళ్తున్న బస్సు.. కారును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో సియోని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు కన్హయ్య జస్వానీ (75), నిక్లేష్ జస్వానీ (45), డ్రైవర్ పురుషోత్తం మహోబియా (37)గా గుర్తించారు. కాగా ఈ ఘటనలో బస్సులోని 26 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిని కియోలారి ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్