కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (కేఎంటీటీపీ)ను భారత్ మయన్మార్తో కలిసి నిర్మిస్తోంది. 2008లో భారత్, ఈ దేశం దీనిపై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్ట్లో భాగంగా కోల్కతాను బంగాళాఖాతం మీదుగా ఈ దేశంలోని రఖాయిన్ రాష్ట్రంలోని సిత్వే ఓడరేవుతో అనుసంధానిస్తారు. అక్కడి నుంచి కలాదాన్ నదీ మార్గం ద్వారా పలెత్వా పట్టణం వరకు ప్రయాణ మార్గం ఉంటుంది.