పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లింగంగుంట్ల వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. ఈ ఘటనలో యాకశిరి హనుమాయమ్మ(60), గన్నవరపు శివపార్వతి(58), షేక్ హజరత్ వలి(65) మృతి చెందారు. ఆటో డ్రైవర్తో పాటు మరో 11 మందికి చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.