ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు వలస కార్మికులు మృతి

69చూసినవారు
ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు వలస కార్మికులు మృతి
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వలస కార్మికులు మరణించారు. గందర్‌బల్‌ జిల్లాలోని సోన్‌మార్గ్‌ ప్రాంతంలోని టన్నెల్‌ నిర్మాణ ప్రదేశంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మరో ఐదుగురు గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్