తాళం తీసి ఏటీఎం మెషీన్‌లో నగదు దోచుకెళ్లిన దుండగులు (వీడియో)

79చూసినవారు
ఏటీఎం మెషీన్లను ధ్వంసం చేసిన దుండగులు నగదు దోచుకెళ్లటం, లేదంటే ఏకంగా ఏటీఎం మెషీన్‌నే ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా గతంలో చాలానే చూశాం. అలాంటిదే ఇక్కడో ATM దోపిడీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని సుమేర్‌పూర్ టౌన్‌లో ఓ వ్యక్తి తాళం సహాయంతో ఏటీఎం మెషీన్‌ ఓపెన్ చేసి నగదు దోచుకెళ్లాడు. అతడికి బయట మరో వ్యక్తి సహకరించాడు. సుమారు రూ.1.5 లక్షలు చోరీ చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్