టీఎంసీ నేత షాజహాన్ షేక్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఎంసీ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆరేళ్లు బహిష్కరించినట్లు పేర్కొంది. సందేశ్ఖాలీలో మహిళలను వేధించారని షాజహాన్పై ఆరోపణలు వచ్చాయి. భూ ఆక్రమణ, రేషన్ బియ్యం కుంభకోణం ఆరోపణలు కూడా ఉన్నాయి. షాజహాన్ను అరెస్ట్ చేయాలంటూ కొన్ని రోజులుగా బెంగాల్లో ఆందోళనలు చేపట్టగా.. అరెస్ట్ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.