ఏపీలో
రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నిన్న
టీడీపీ-
జనసేన ఉమ్మడి మీటింగ్లో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు అంటూ రోజా ఎద్దేవా చేశారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్.. సీఎం వైఎస్
జగన్ గురించి మాట్లాడుతాడా? అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కు వెళ్లిందన్నారు. చంద్రబాబు దగ్గర ఊడిగం చేయడంతోనే పవన్ అధఃపాతాళానికి వెళ్లిపోయాడన్నారు.