నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై ధర్మాసనం వాదనలు విననుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఎరవేశారన్న కేసులో చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది. దీనిపై 2017లో ఆళ్ల సుప్రీంను ఆశ్రయించగా, కేసు వాయిదా పడుతూ వస్తోంది.