ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి భారీ షాక్ తగలనుంది. నంద్యాలకు చెందిన జనసేన కీలక నేత, పార్టీ కో-ఆర్డినేటర్ విశ్వనాథ్ ఇవాళ వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన విశ్వనాథ్కు పొత్తు కారణంగా టికెట్ దక్కలేదు. దాంతో కొంత కాలంగా అసంతృప్తిలో ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.