ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణాన్ని తిలకించనున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషన్, సెషెల్స్తో పాటు మాల్దీవ్స్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.