నేడే మోదీ ప్రమాణం.. కొలువుదీరనున్న ఎన్డీయే సర్కార్‌

80చూసినవారు
నేడే మోదీ ప్రమాణం.. కొలువుదీరనున్న ఎన్డీయే సర్కార్‌
ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణాన్ని తిలకించనున్నారు. బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషన్‌, సెషెల్స్‌తో పాటు మాల్దీవ్స్‌ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్