ప్రధాని మోదీ నేడు సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, పూజలు చేయనున్నారు. అనంతరం బేగంపేట నుంచి హెలికాప్టర్లో పటాన్చెరులోని పటేల్గూడకు వెళ్తారు. అక్కడ జరిగే బహిరంగ సభ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు.