400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున సాయం రేపే అందిస్తాం: మంత్రి నాదెండ్ల

81చూసినవారు
400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున సాయం రేపే అందిస్తాం: మంత్రి నాదెండ్ల
వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు రూ.లక్ష చొప్పున సోమవారం విరాళం అందిస్తామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పంచాయతీలను ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ సొంతనిధుల నుంచి రూ.4 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, కూటమి నేతలు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్