గుజరాత్లోని సూరత్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. పాల్ ప్రాంతంలోని శ్రీపాద్ సెలబ్రేషన్స్ అనే రెసిడెన్షియల్ భవనంలోని ఏడవ అంతస్తులో హౌస్ కీపింగ్ పని చేస్తున్న మహిళ.. తన రెండేళ్ల కొడుకును వెంట తీసుకెళ్లింది. అక్కడే బాల్కనీలో గ్రిల్తో ఆడుకుంటూ బాలుడు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఫ్లాట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి.