హాథ్రస్ విషాదం.. కాల్వలో పడ్డవాళ్లని తొక్కుకుంటూ వెళ్లారు

76చూసినవారు
హాథ్రస్ విషాదం.. కాల్వలో పడ్డవాళ్లని తొక్కుకుంటూ వెళ్లారు
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లో జరిగిన తొక్కిసలాటలో 122 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో అక్కడి భయానక దృశ్యాలను ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ‘సత్సంగ్ అయిపోగానే ఒక్కసారిగా అందరూ బయటకొచ్చారు. తోపులాటలో ప్రాంగణం బయట రోడ్డు కింద ఉన్న మురికి కాల్వలో చాలా మంది పడ్డారు. వాళ్లను జనం తొక్కుకుంటూ వెళ్లారు. కింద ఉన్న వాళ్లు ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయారు’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్