విదేశాలకు వెళ్లిన నాలుగేళ్లకు ఇంటికి బయలుదేరిన యువతి, విమానంలోనే కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న మన్హీత్ కౌర్(24) మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. క్వాంటాస్ విమానాన్ని ఎక్కేందుకు తుల్లామరైన్ ఎయిర్పోర్ట్ లో ఉండగా అస్వస్థతకు గురైంది. అయినప్పటికీ విమానంలో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఉండగానే కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జూన్ 20న జరిగింది.