విషాదం.. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

73చూసినవారు
విషాదం.. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో స్కూటీని కారు ఢీకొనడంతో రమేష్‌(55) అనే వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం చాగల్లు వద్ద మరో ప్రమాదంలో జాతీయ రాహదారిపై కారు ఢీ కొని లచ్చమ్మ (70) అనే వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలాలకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్