ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతిచెందిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బి.సుభాషిణి(55) అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నారు. అధికారులు ఆమెకు కావలిలో ఎన్నికల విధులు కేటాయించారు. దీంతో తన కుమారుడు విజయ్(19)తో విధుల కోసం వెళ్తుండగా.. రైల్వే ట్రాక్ దాటుతుండగా సుభాషిణిని రైలు ఢీకొట్టింది. కాపాడేందుకు వెళ్లిన కుమారుడు కూడా ప్రాణాలు విడిచాడు.