తెలంగాణలో 47 మంది డీఎస్పీల బదిలీ

55చూసినవారు
తెలంగాణలో 47 మంది డీఎస్పీల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం భారీగా బదిలీలను చేపడుతోంది. తాజాగా రాష్ట్రంలో 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. అయితే మరోమారు వారిని మార్చింది. ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని పోలీస్ శాఖ ఈ బదిలీలను చేపట్టింది. ఒకే పార్లమెంట్ పరిధిలో నాలుగేళ్లు పని చేసిన డీఎస్పీలను తాజాగా పోలీస్ శాఖ బదిలీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్