సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూవివాదం కారణంగా శ్రీనివాస్ అనే వ్యక్తిపై తన అన్న వినోద్ హత్యాయత్నం చేశాడు. శ్రీనివాస్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో శ్రీనివాస్కు తీవ్ర గాయాలవ్వగా.. గాంధీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.