ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీతారామ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల వేగవంతంపై నీటి పారుదల శాఖ అధికారులతో శుక్రవారం వీరు చర్చలు జరిపారు. ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.