రాజస్థాన్లోని జోధ్పూర్లో బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా హత్య చేశారు. పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగుడు భన్వారీ దేవి(65)ని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆమె ఇద్దరు మనవరాళ్ళు అయిన భవాని(5), మూడున్నరేళ్ల లక్షితలను ట్యాంక్లోని నీళ్లలో ముంచి హత్య చేశాడు. అమాయక బాలికల తల్లిని గొడ్డలితో కొట్టారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.