విమానానికి బాంబు బెదిరింపు.. నిందితుడి అరెస్ట్

57చూసినవారు
విమానానికి బాంబు బెదిరింపు.. నిందితుడి అరెస్ట్
కొద్ది రోజుల క్రితం చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యారు నివాసి వి ప్రసన్నగా గుర్తించారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బృందం ప్రసన్నను అరెస్ట్ చేసింది. చెన్నై-ముంబై విమానంలో బాంబు పెట్టినట్లు కస్టమర్ సర్వీస్ సెంటర్ చాట్‌లో ప్రసన్న పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్