AP: జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి ఇవాళ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. బాలశౌరి మీటింగ్కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని వాలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఆడియో నెట్టింట వైరలవుతోంది.