జమ్మూకశ్మీర్‌ నౌషెరాలో చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతం

75చూసినవారు
జమ్మూకశ్మీర్‌ నౌషెరాలో చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నౌషెరా సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించారు. గుర్తించిన సైనికులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్