తాజ్‌మహల్ గార్డెన్‌లో మూత్ర విసర్జన చేసిన ఇద్దరు పర్యాటకులు.. వీడియో వైరల్

73చూసినవారు
తాజ్‌మహల్ గార్డెన్‌లో ఇద్దరు పర్యాటకులు మూత్ర విసర్జన చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో, అధికారులు విచారణ ప్రారంభించారు. గార్డెన్స్‌లో సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నామని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తెలిపింది. ఆగ్రా ఏఎస్ఐ చీఫ్ ఆర్కే పటేల్ మాట్లాడుతూ.. ఈ విషయమై తాజ్ మహల్ ఇన్‌చార్జ్‌ని వివరణ కోరుతున్నామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా గార్డెన్‌లలో నిఘా పెంచాలని భద్రతా సిబ్బందిని కోరామని తెలిపారు.

సంబంధిత పోస్ట్