బొలెరో టైర్‌ పేలి ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం

55చూసినవారు
బొలెరో టైర్‌ పేలి ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం
కర్నూలు జిల్లా మద్దికేర వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిరపకోతకు వెళ్లిన కూలీలు బొలెరో వ్యాన్‌లో తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తు వ్యాన్‌ టైర్‌పేలి విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయలయ్యాయి. మృతులు మద్దికేర ఆగ్రహారానికి చెందిన ఆదిలక్ష్మి, సంజయమ్మలుగా గుర్తించారు. క్షతగాత్రులను అనంతపురం జిల్లా గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్