కర్నూలు జిల్లా మద్దికేర వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిరపకోతకు వెళ్లిన కూలీలు బొలెరో వ్యాన్లో తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తు వ్యాన్ టైర్పేలి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయలయ్యాయి. మృతులు మద్దికేర ఆగ్రహారానికి చెందిన ఆదిలక్ష్మి, సంజయమ్మలుగా గుర్తించారు. క్షతగాత్రులను అనంతపురం జిల్లా గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.