మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (వీడియో)

84చూసినవారు
ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కుటుంబ వ్యవహారాలు, వ్యకిగత విషయాలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు అని వివరించారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఈ దేశంలో ఎవరికి లేదని ఆయన తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్