వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై
అమెరికా ఆంక్షలు విధించింది. పాలస్తీనావాసులపై పెరుగుతున్న హింస నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. మిత్రదేశమైన ఇజ్రాయెల్కు చెందిన పౌరులపై అగ్రరాజ్యం ఇలా అనూహ్య చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తొలిదశలో భాగంగా వెస్ట్ బ్యాంక్లోని నలుగురు ఇజ్రాయెల్ సెటిలర్లపై
అమెరికా ఆర్థిక ఆంక్షలతో పాటు
వీసా నిషేధం విధించింది.