నేడు ఆరో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ తో కలిసి ఓటు వేసిన వారిలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆయన కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ఉన్నారు. ఓటు వేసిన తరువాత వారందరూ కలిసి తమ సిరా వేళ్లను చూపించారు.