నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో జనగామ రైతులు మాజీ సీఎం కేసీఆర్ ఎదుట తమ ఆవేదన వెల్లడించారు. 'మీరు ఉన్నప్పుడే మంచిగుండె సార్.. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మోటార్లు కాలిపోతున్నయ్.. సుక్క నీళ్లు వస్తలేవు' అంటూ కేసీఆర్ తో తమ ఆవేదనను చెప్పుకున్నారు. దీంతో తమకు అండగా ఉంటామని.. కొట్లాడుదాం.. పోరాటం చేద్దాం అని కేసీఆర్ ధైర్యం చెప్పారు.