బీహార్లోని నవాడాలో పెను ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ బస్సు రైల్వే ట్రాక్ దాటుతూ మధ్యలో ఆగిపోయింది. రైల్వే లైన్ క్రాసింగ్పై ఇరుక్కున్న ఆ బస్సులో చిన్నారులు ఉన్నారు. అదే సమయంలో ఓ ట్రైన్ అటుగా వచ్చింది. రైల్వే ట్రాక్పై స్కూల్ బస్సును లోకోపైలట్ గమనించాడు. వెంటనే రైలును ఆపాడు. దీంతో బస్సుకు, అందులోని చిన్నారులకు పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. స్థానికులు అక్కడకు వచ్చి బస్సును బయటకు తీశారు.