కల్తీసారా.. 13కు చేరిన మృతుల సంఖ్య

68చూసినవారు
కల్తీసారా.. 13కు చేరిన మృతుల సంఖ్య
తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 13కు చేరింది. మరో 60 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌ శ్రవణ్ కుమార్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇక జిల్లా ఎస్పీ సమయిసింగ్ మీనాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్