కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలు ఎక్కువయ్యాయి : బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

76చూసినవారు
కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలు ఎక్కువయ్యాయి : బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలు ఎక్కువయ్యాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.చేవెళ్ల లో ప్రచారం అనంతరం భోజనం చేశారు,చేస్తుండగా ఒక్క సారిగా కరెంటు పోయి గంట తర్వాత వచ్చింది. ఈ సంఘటన నిమిత్తం కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. అసలే ఎండాకాలం కరెంటు కష్టాలు ఇలా ఐతే ప్రజలు ఎలా నివసించాలని అన్నారు. ఎన్నికల ముందే ఇలా ఉంటే ఎన్నికల తర్వాత పేద ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే బీజేపీకే పట్టం కట్టాలని కొండా పిలుపునిచ్చారు. బాధ్యత గల ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్