కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా దౌల్తాబాద్ మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో సోమవారం కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.