కౌశిక్‌ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం: పట్నం నరేందర్ రెడ్డి

72చూసినవారు
కౌశిక్‌ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం: పట్నం నరేందర్ రెడ్డి
ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో శనివారం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడాతూ. ఓ ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే దాడికి పాల్పడటం సమంజసం కాదని, ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్